రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాగలి పట్టి చెలకదున్నారు. ఈ అరుదైన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం రామచంద్రపురం గ్రామంలో చోటుచేసుకుంది. దేవాదుల నీరు విడుదల అనంతరం కాలినడకన కాలువలను పరిశీలిస్తున్న క్రమంలో పక్కనే ఓ రైతు చెలక దున్నుతుండడం గమనించిన మంత్రి... ఆ రైతు వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. దేవాదుల నీటి విడుదల గురించి రైతుకు వివరించారు.
ఇంతలో మంత్రి రైతు వద్ద నుంచి నాగలి తీసుకుని పాట పాడుకుంటూ చెలక దున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న రైతులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవీ చూడండి: 'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి'