ETV Bharat / state

తల్లిదండ్రులను సజీవదహనం చేసిన రాక్షసుడు - A son The burning of the living of his Parents in Madipally thanda

తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి తప్పించేందుకు ఒక్క కుమారుడైనా ఉండాలన్నది నానుడి. అయితే ఇక్కడ అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడే తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడు.

తల్లిదండ్రులను సజీవదహనం చేసిన రాక్షసుడు
author img

By

Published : Oct 30, 2019, 8:56 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం మడిపెల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో మంచంపై పడుకున్న తల్లిదండ్రలపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడో కిరాతకుడు. వృద్ధులైన తల్లిదండ్రులు భూక్యా దస్రు, భాజీలకు కొడుకు కేతూరాంకు మధ్య కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం కూడా ఇదే విషయమై గొడవ జరగటంతో అగ్రహించిన కొడుకు వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రుల సజీవదహనం గ్రామంలో విషాదాన్ని నింపింది.

తల్లిదండ్రులను సజీవదహనం చేసిన రాక్షసుడు

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం మడిపెల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో మంచంపై పడుకున్న తల్లిదండ్రలపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడో కిరాతకుడు. వృద్ధులైన తల్లిదండ్రులు భూక్యా దస్రు, భాజీలకు కొడుకు కేతూరాంకు మధ్య కొంతకాలంగా భూతగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం కూడా ఇదే విషయమై గొడవ జరగటంతో అగ్రహించిన కొడుకు వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రుల సజీవదహనం గ్రామంలో విషాదాన్ని నింపింది.

తల్లిదండ్రులను సజీవదహనం చేసిన రాక్షసుడు

ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.