తూర్పు నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి : జిల్లా సాధన సమితి వరంగల్ జిల్లా నుంచి వరంగల్ తూర్పు కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా సాధన సమితి ఆందోళన చేపట్టింది. ఇందుకు లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన ముసాయిదా ప్రకారం తూర్పు జిల్లా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తూర్పు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి :కాలువకు గండిపడే... పంటలు నిండా మునిగే...!