ETV Bharat / state

పాలెం కేవీకే జలసంరక్షణ కృషి’కి జాతీయ అవార్డు

నీటి సంరక్షణ పద్ధతుల్లో ఉత్తమ పరిశోధనలకు పాలెం కృషి విజ్ఞాన కేంద్రానికి జాతీయ అవార్డు లభించింది.

author img

By

Published : Jul 25, 2019, 12:40 PM IST

పాలెం కేవీకే జలసంరక్షణ కృషి’కి జాతీయ అవార్డు

దక్షిణ తెలంగాణ ప్రాంతంలో నీటి సమస్య నివారణకు పాలెం లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం... స్థానిక పరిస్థితులను తట్టుకొనే పంటరకాలను రూపొందించి రైతులకు సాయం చేస్తోంది.

రైతులకు విలువైన వ్యవసాయ సమాచారం

బిజినేపల్లి మండలం పాలెంలో ఏర్పాటుచేసిన కృషి విజ్ఞానకేంద్రం ప్రధానంగా నీటి వినియోగం, సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నీటివృథాకు అడ్డుకట్ట వేయగలిగింది. ఈ కృషికిగాను జులై 23న నాబార్డ్‌ 38వ వ్యవస్థాపక దినోత్సవాల్లో పాలెం కృషి విజ్ఞానకేంద్రానికి ఉత్తమ సంస్థగా జాతీయ అవార్డు లభించింది. బిజినేపల్లి నుంచి నాగర్‌కర్నూలుకు వెళ్లే మార్గంలో పాలెం కృషి విజ్ఞాన కేంద్రాన్ని 2011లో కేంద్రీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలమూరు రైతులకు విలువైన వ్యవసాయ సమాచారం, నాణ్యమైన కొత్తరకం వంగడాలు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిందుసేద్య పద్ధతిని పాటించి ఒక ఎకరా వరికి పారించే నీటితో నాలుగెకరాల కూరగాయల పంటలను సాగుచేసి రైతులకు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో 60 శాతం నీటిని ఆదా చేయవచ్చని రైతులకు తెలియజేశారు.

తక్కువ నీటితో అధిక దిగుబడులు

పొలంగట్ల పైన మునగ, కరివేపాకు లాంటి వాణిజ్యపంటల మొక్కలను నాటి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు తెలియజేశారు. సమగ్ర వ్యవసాయ పద్ధతి ద్వారా కేవలం వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలే కాకుండా వ్యయసాయానుబంధ పంటలైన తీగజాతి కూరగాయలు, వంగ, టమాట, బంతి సాగుతోపాటు గొర్రెలు, కోళ్లను పెంచి మంచి లాభాలను ఆర్జించవచ్చని రైతులకు వివరించారు. సాగైన పంటలను కోసిన తరువాత వ్యర్థాలను చాపింగ్‌యంత్రం ద్వారా భూమిలోనే కలియదున్ని నేల సారాన్ని పెంచుతూ, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు పాలెం శాస్త్రవేత్తలు విశేషంగా కృషి చేశారు. నీటి వినియోగం, సంరక్షణపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పాలెం కేవీకే సమన్వయకర్త జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చాలామంది అవగాహన లేకపోవడంతో అవసరానికి మించి నీటిని వృథా చేసేవారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : అంగన్​వాడీ నిర్వహణపై వనపర్తి కలెక్టర్​ ఆగ్రహం

దక్షిణ తెలంగాణ ప్రాంతంలో నీటి సమస్య నివారణకు పాలెం లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం... స్థానిక పరిస్థితులను తట్టుకొనే పంటరకాలను రూపొందించి రైతులకు సాయం చేస్తోంది.

రైతులకు విలువైన వ్యవసాయ సమాచారం

బిజినేపల్లి మండలం పాలెంలో ఏర్పాటుచేసిన కృషి విజ్ఞానకేంద్రం ప్రధానంగా నీటి వినియోగం, సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నీటివృథాకు అడ్డుకట్ట వేయగలిగింది. ఈ కృషికిగాను జులై 23న నాబార్డ్‌ 38వ వ్యవస్థాపక దినోత్సవాల్లో పాలెం కృషి విజ్ఞానకేంద్రానికి ఉత్తమ సంస్థగా జాతీయ అవార్డు లభించింది. బిజినేపల్లి నుంచి నాగర్‌కర్నూలుకు వెళ్లే మార్గంలో పాలెం కృషి విజ్ఞాన కేంద్రాన్ని 2011లో కేంద్రీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పాలమూరు రైతులకు విలువైన వ్యవసాయ సమాచారం, నాణ్యమైన కొత్తరకం వంగడాలు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిందుసేద్య పద్ధతిని పాటించి ఒక ఎకరా వరికి పారించే నీటితో నాలుగెకరాల కూరగాయల పంటలను సాగుచేసి రైతులకు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో 60 శాతం నీటిని ఆదా చేయవచ్చని రైతులకు తెలియజేశారు.

తక్కువ నీటితో అధిక దిగుబడులు

పొలంగట్ల పైన మునగ, కరివేపాకు లాంటి వాణిజ్యపంటల మొక్కలను నాటి తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు తెలియజేశారు. సమగ్ర వ్యవసాయ పద్ధతి ద్వారా కేవలం వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలే కాకుండా వ్యయసాయానుబంధ పంటలైన తీగజాతి కూరగాయలు, వంగ, టమాట, బంతి సాగుతోపాటు గొర్రెలు, కోళ్లను పెంచి మంచి లాభాలను ఆర్జించవచ్చని రైతులకు వివరించారు. సాగైన పంటలను కోసిన తరువాత వ్యర్థాలను చాపింగ్‌యంత్రం ద్వారా భూమిలోనే కలియదున్ని నేల సారాన్ని పెంచుతూ, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు పాలెం శాస్త్రవేత్తలు విశేషంగా కృషి చేశారు. నీటి వినియోగం, సంరక్షణపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పాలెం కేవీకే సమన్వయకర్త జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. చాలామంది అవగాహన లేకపోవడంతో అవసరానికి మించి నీటిని వృథా చేసేవారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : అంగన్​వాడీ నిర్వహణపై వనపర్తి కలెక్టర్​ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.