ETV Bharat / state

'ఆజాదీ కా అమృత్​ మహాత్సవ్'లో భాగంగా ఫ్రీడం రన్​

author img

By

Published : Mar 24, 2021, 4:59 PM IST

ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం సిద్ధించిందని వనపర్తి జిల్లా కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ భాష, ఎస్పీ అపూర్వరావు అన్నారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఫ్రీడం రన్​ను జెండా ఊపి ప్రారంభించారు.

wanaparthy news
'ఆజాదీ కా అమృత్​ మహాత్సవ్'లో భాగంగా ఫ్రీడం రన్​

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్​ మహాత్సవ్​ సంబురాల్లో భాగంగా వనపర్తిలో ఫ్రీడం రన్​ పేరిట 2కె రన్​ నిర్వహించారు. పాలిటెక్నిక్​ కళాశాల మైదానం నుంచి ఎకో పార్కు వరకు నిర్వహించిన రన్​ను కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ భాష, ఎస్పీ అపూర్వరావు జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య్ర సాధనలో ఎందరో మహానుభావులు, సమరయోదుల త్వాగాల ఫలితంగానే ప్రస్తుతం మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్​కుమార్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్​ మహాత్సవ్​ సంబురాల్లో భాగంగా వనపర్తిలో ఫ్రీడం రన్​ పేరిట 2కె రన్​ నిర్వహించారు. పాలిటెక్నిక్​ కళాశాల మైదానం నుంచి ఎకో పార్కు వరకు నిర్వహించిన రన్​ను కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ భాష, ఎస్పీ అపూర్వరావు జెండా ఊపి ప్రారంభించారు. స్వాతంత్య్ర సాధనలో ఎందరో మహానుభావులు, సమరయోదుల త్వాగాల ఫలితంగానే ప్రస్తుతం మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ కిరణ్​కుమార్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


ఇవీచూడండి: దేశభక్తిని పెంపొందించేలా అమృత్ మహోత్సవాలు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.