తెలంగాణ బంద్ సందర్భంగా వనపర్తి జిల్లా వనపర్తి డిపో నుంచి పోలీసుల ఆధ్వర్యంలో బయటకు తీసిన ఆర్టీసీ బస్సు అద్దంను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు నాయకులు డిపో ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిఘటించడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను బలవంతంగా లాక్కెళ్లారు.
ఇదీ చూడండి : మహిళను వెంబడించి అరెస్టు చేసిన పోలీసులు