ETV Bharat / state

కొత్తకోటకు చేరిన కర్ణాటక వాసుల పాదయాత్ర

అయోధ్యలో రామమందిరం నిర్మించాలంటూ... కర్ణాటక వాసులు అయోధ్య వరకు చేపట్టిన పాదయాత్ర కొత్తకోటకు చేరుకుంది.

author img

By

Published : Sep 4, 2019, 4:43 PM IST

పాదయాత్ర
కర్ణాటక వాసుల పాదయాత్ర

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కోరుతూ కర్ణాటక వాసులు చేస్తున్న పాదయాత్ర వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరింది. వీరికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మంజునాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలోని హూడి నుంచి ఉత్తరప్రదేశ్​లోని అయోధ్య వరకు పాదయాత్రకు పూనుకున్నారు. ఆగస్టు 16న ప్రారంభమైన యాత్ర నేడు కొత్తకోటకు చేరుకుంది. పట్టణంలోని రామభక్తులు, హిందూ వాహిని సభ్యులు మహా పాదయాత్రకు స్వాగతం పలికి రామాలయం వరకు ర్యాలీగా వచ్చారు. సంవత్సరం లోపు రామమందిరం నిర్మాణం చేపట్టాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు మంజునాథ్ తెలిపారు. రామమందిర నిర్మాణం కోసం పాదయాత్ర ద్వారా 2 ఇటుకలు తీసుకెళ్తున్నామని, గ్రామ గ్రామాన కొలువైన రామ మందిరంలో వీటికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: సేవ్​ గర్ల్​చైల్డ్​ నినాదంతో మట్టి గణపతి దర్శనం

కర్ణాటక వాసుల పాదయాత్ర

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కోరుతూ కర్ణాటక వాసులు చేస్తున్న పాదయాత్ర వనపర్తి జిల్లా కొత్తకోటకు చేరింది. వీరికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. మంజునాథ్ ఆధ్వర్యంలో ఆరుగురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలోని హూడి నుంచి ఉత్తరప్రదేశ్​లోని అయోధ్య వరకు పాదయాత్రకు పూనుకున్నారు. ఆగస్టు 16న ప్రారంభమైన యాత్ర నేడు కొత్తకోటకు చేరుకుంది. పట్టణంలోని రామభక్తులు, హిందూ వాహిని సభ్యులు మహా పాదయాత్రకు స్వాగతం పలికి రామాలయం వరకు ర్యాలీగా వచ్చారు. సంవత్సరం లోపు రామమందిరం నిర్మాణం చేపట్టాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు మంజునాథ్ తెలిపారు. రామమందిర నిర్మాణం కోసం పాదయాత్ర ద్వారా 2 ఇటుకలు తీసుకెళ్తున్నామని, గ్రామ గ్రామాన కొలువైన రామ మందిరంలో వీటికి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి: సేవ్​ గర్ల్​చైల్డ్​ నినాదంతో మట్టి గణపతి దర్శనం

tg_wgl_41_03_mla paryatana_av_TS10074 Cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా. పరకాల నియోజకవర్గం. *నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్..ఎమ్మెల్యే చల్లా...* నిరుపేదలకి అండగా ఉంటూ వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషిచేస్తున్నారని వరంగల్ రురల్ జిల్లా గేసుకొండ లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.మండలకేంద్రంలో రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇల్లు మంజూరు పత్రాలు మంగళవారం నాడు అందచేశారు.ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గారి ఆ గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో నూతన ఇండ్లను మంజూరు చేయించి నేరుగా బాధితుల ఇంటికి వెళ్లి మంజూరు పత్రాలు అందచేయడం జరిగింది.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణలో 182 కుటుంబాలకు ఇండ్లు మంజూరు అయ్యాయన్నారు.సంబంధిత అధికారులు తక్షణమే లబ్ధిదారులతో మమేకమై సాధ్యమైనంత త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.త్వరలో నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమం,అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు.మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు.దేశానికే ఆదర్శ రాష్ట్రంగా,ఆదర్శ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఈరోజు నిలిచారన్నారు.ఇదంతా కనిపివ్వని ప్రతిపక్ష పార్టీలు కల్లబొల్లి మాటలతో,అసత్య ఆరోపణలు చేయడమే కాకుండా,ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారన్నారు.వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.పట్టుదలతో రాష్ట్రాభివృద్ధికి,ప్రజల క్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న కేసీఆర్ గారికి ప్రజల మద్దతు ఉందని,వారిని ఎవ్వరు ఏంచేయలేరని అన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.