ETV Bharat / state

వికారాబాద్ జిల్లాలో మరో మూడు కరోనా కేసులు

author img

By

Published : May 31, 2020, 10:32 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. వికారాబాద్​ జిల్లాలో ఈరోజు మరో మూడు కరోనా పాజిటివ్​ కేసులు వెలుగులోకి వచ్చాయి.

Three more corona cases in Vikarabad district
వికారాబాద్ జిల్లాలో మరో మూడు కరోనా కేసులు

వికారాబాద్ జిల్లాలో ఈరోజు కొత్తగా మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిని అధికారులు హైదరాబాద్​లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురు గతేడాది ఉపాధికోసం ముంబయి వెళ్లారు. లాక్​డౌన్ నేపథ్యంలో వారు మే 15న అక్కడి నుంచి బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి తనిఖీ కేంద్రం వద్ద వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొదటి రెండు పరీక్షల్లో వారికి నెగిటివ్ వచ్చింది.

మరోసారి అధికారులు పరీక్షలు చేశారు. కానీ ఆ నివేదిక వచ్చే లోపే వారు స్వగ్రామానికి చేరుకున్నారు. నివేదిక చూసిన అధికారులు వారి కోసం వాకబు చేశారు. ఆ నివేదికను ఇక్కడి అధికారులకు చేరవేశారు. స్పందించిన అధికారులు వెంటనే వారిని హైదరాబాద్​కు తరలించారు. వారితో కలిసి ఉన్న 10 మందిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు.

వికారాబాద్ జిల్లాలో ఈరోజు కొత్తగా మరో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిని అధికారులు హైదరాబాద్​లోని కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురు గతేడాది ఉపాధికోసం ముంబయి వెళ్లారు. లాక్​డౌన్ నేపథ్యంలో వారు మే 15న అక్కడి నుంచి బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి తనిఖీ కేంద్రం వద్ద వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మొదటి రెండు పరీక్షల్లో వారికి నెగిటివ్ వచ్చింది.

మరోసారి అధికారులు పరీక్షలు చేశారు. కానీ ఆ నివేదిక వచ్చే లోపే వారు స్వగ్రామానికి చేరుకున్నారు. నివేదిక చూసిన అధికారులు వారి కోసం వాకబు చేశారు. ఆ నివేదికను ఇక్కడి అధికారులకు చేరవేశారు. స్పందించిన అధికారులు వెంటనే వారిని హైదరాబాద్​కు తరలించారు. వారితో కలిసి ఉన్న 10 మందిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్‌ కేసులు... ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.