వికారాబాద్ జిల్లాలో దిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారిని గుర్తించి.. పరీక్ష చేయించాలని ఎమ్మెల్సీ రాంచందర్రావు అన్నారు. జిల్లా ఎస్పీ నారాయణను కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. వికారాబాద్ పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మర్కజ్ నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి పరీక్షలు చేయాలని కోరారు. జిల్లాలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, ఆహారం లాంటివి సరఫరా చేసే ఏర్పాటు చేయాలన్నారు.
ఇదీ చూడండి : మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త