రేషన్ కోసం ఎవరూ పరేషాన్ కావద్దని... వికారాబాద్ జిల్లా కుల్కచర్ల డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ రావ్ తెలిపారు. ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి గడువేమి లేదని అన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. లింక్ చేసే పనిని ఆయా గ్రామాల డీలర్లకే అప్పజెప్పాలని... యువజన సంఘాల నాయకులు, ఎబీవీపీ కార్యకర్తలు ఆయనకు వినతిపత్రం అందజేశారు
ఆధార్కు చరవాణి నంబర్ను లింక్ చేసేందుకు వారం రోజులుగా రేషన్ వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తహసీల్దార్ను కోరారు.
ఇదీ చదవండి: 'ఎన్నాళ్లు కిరాయి ఇంట్లో ఉంటాం.. చిన్న ఇల్లైనా తీసుకోవాలి'