ETV Bharat / state

'వలస కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి' - jansahas director distributed groceries to migrants at kulkacharla

వికారాబాద్​ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని పలు తండాల్లో స్వస్థలాలకు తిరిగివచ్చిన వలసకూలీలకు తమ వంతు సాయంగా జన్​సహస్ సంస్థ డైరెక్టర్ నవీన్​కుమార్ నిత్యావసరాలను అందజేశారు. ఇలాంటి వీరందరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

jansahas director distributed groceries to migrants at kulkacharla
'వలస కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి'
author img

By

Published : Jun 29, 2020, 7:26 PM IST

బతుకుదెరువు కోసం ముంబై, పూణె నుంచి వలస వెళ్లి వచ్చిన కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని జన్​సహస్ సంస్థ డైరెక్టర్ నవీన్​కుమార్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. వికారాబాద్​ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని పలు తండాల్లో స్వస్థలాలకు తిరిగివచ్చిన వలసకూలీలను ఆయన కలిశారు. తమ వంతు సాయంగా వారికి నిత్యావసరాలను అందజేశారు.

లాక్​డౌన్​ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వలసకూలీలు తండాల్లో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారిందని.. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని నవీన్​కుమార్​ కోరారు.

బతుకుదెరువు కోసం ముంబై, పూణె నుంచి వలస వెళ్లి వచ్చిన కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని జన్​సహస్ సంస్థ డైరెక్టర్ నవీన్​కుమార్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. వికారాబాద్​ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని పలు తండాల్లో స్వస్థలాలకు తిరిగివచ్చిన వలసకూలీలను ఆయన కలిశారు. తమ వంతు సాయంగా వారికి నిత్యావసరాలను అందజేశారు.

లాక్​డౌన్​ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చిన వలసకూలీలు తండాల్లో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారిందని.. అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని నవీన్​కుమార్​ కోరారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.