వికారాబాద్ జిల్లాలో ఉదయం దట్టమైన పొగమంచు వ్యాపించింది. మంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతంలో సాధారణం కంటే 5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
శనివారం ఉదయం మంచు పొరలతో చీకట్లు అలుమున్నాయి. ఉదయం ఏడు గంటలైనా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. దారి కనిపించక కొంతమంది రోడ్డు పక్కన వాహనాలు నిలిపివేశారు.