ETV Bharat / state

బైక్​ వేగంగా నడపవద్దన్నందుకు దాడి

వాహనాన్ని వేగంగా నడపకండి అని చెప్పినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు యువకులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.

author img

By

Published : Jul 21, 2019, 7:48 PM IST

దాడి


ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడపవద్దన్నందుకు ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుడైన నర్సింహులు గురువారం రాత్రి తన మిత్రుని ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. టీచర్స్ కాలనీ సమీపంలో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై అధిక వేగంతో చక్కర్లు కొడుతూ నర్సింహులు వాహనానికి అడ్డుగా వచ్చారు. సదరు యువకుల్ని వాహనాన్ని అతివేగంగా నడపవద్దని వారించాడు. కోపోద్రిక్తులైన యువకులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

దాడిలో నర్సింహులు తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు నర్సింహులును సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నర్సింహులు... స్థానికంగా యువకులు గంజాయి ఎక్కువగా సేవిస్తున్నారని.. ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయని తెలిపారు.


ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడపవద్దన్నందుకు ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుడైన నర్సింహులు గురువారం రాత్రి తన మిత్రుని ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. టీచర్స్ కాలనీ సమీపంలో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై అధిక వేగంతో చక్కర్లు కొడుతూ నర్సింహులు వాహనానికి అడ్డుగా వచ్చారు. సదరు యువకుల్ని వాహనాన్ని అతివేగంగా నడపవద్దని వారించాడు. కోపోద్రిక్తులైన యువకులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

దాడిలో నర్సింహులు తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు నర్సింహులును సమీపంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నర్సింహులు... స్థానికంగా యువకులు గంజాయి ఎక్కువగా సేవిస్తున్నారని.. ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నాయని తెలిపారు.

దాడి

ఇవీ చూడండి: చంద్రయాన్​-2 కౌంట్​డౌన్ షురూ.. రేపే ప్రయోగం

Intro:tg_kmm_01_21_nirvasitula_samavesham_ab_ts10044
( )


నాగపూర్ నుంచి అమరావతి వరకు కు హైవే రోడ్డు నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని ఖమ్మం రైతులు స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం రఘునాధపాలెం మండలం భూములు కోల్పోతున్న రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. బల్లేపల్లి లక్ష్మి గార్డెన్ లో భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఖమ్మం జిల్లా వామపక్ష పార్టీల జిల్లా కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి హాజరై భూసేకరణ చట్టాలపై వివరించారు. రైతులు చేసే పోరాటానికి మద్దతు ఇస్తామన్నారు. తీర్ధాల నుంచి వెంకటాపురం వరకు 260 ఎకరాలు సాగు భూమి కోల్పోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. రోడ్డు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని తీర్మానం చేశారు.....byte
byte... భద్రయ్య భూ నిర్వాసిత కమిటీ అధ్యక్షుడు


Body:భూ నిర్వాసితుల కమిటీ సమావేశం


Conclusion:భూ నిర్వాసితుల కమిటీ సమావేశం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.