ETV Bharat / state

కర్నల్ సంతోశ్​ కుటుంబానికి కిషన్​రెడ్డి భరోసా.!

గల్వాన్ లోయలో చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కర్నల్ సంతోశ్​ బాబు కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పరామర్శించారు. సూర్యాపేటలో సంతోశ్​ బాబు కుటుంబ సభ్యులను కలిసి కిషన్​ రెడ్డి... వారికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

author img

By

Published : Jun 21, 2020, 6:51 PM IST

Updated : Jun 21, 2020, 9:42 PM IST

union-minister-kishan-redd-meet-santosh-babu-family-at-suryapet
కర్నల్ సంతోశ్​ బాబు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

గల్వాన్ లోయలో చైనా దొంగదెబ్బతో వీరమరణం పొందిన కర్నల్​ సంతోశ్​ బాబు కుటుంబానికి భారత ఆర్మీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.​ సూర్యాపేటలో సంతోశ్​ బాబు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి పరామర్శించారు. కర్నల్​.. ఏ లక్ష్యం కోసమైతే ప్రాణత్యాగం చేశారో ఆయన లక్ష్యం సాధించేందుకు ప్రధానమంత్రి మోడీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. చైనా వస్తువులను బహిష్కరించాలని మంత్రి సూచించారు.

కర్నల్​ కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుద్​నుతో మాట్లాడారు. కోరుకొండ సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ సమయాల్లో సంతోశ్ బాబు నైపుణ్యాన్ని ఫోటో ఆల్బమ్ తెప్పించుకొని తిలకించారు. చిన్ననాటినుంచే సైనికుడిని చేయాలన్నా తన ఆకాంక్ష మేరకే తన కుమారుడు కోరుకొండ సైనిక్ స్కూల్​లో తొలి ప్రయత్నంలోనే అడ్మిషన్ సాధించాడని సంతోశ్​ బాబు తండ్రి ఉపేందర్ మంత్రికి వివరించారు. సంతోష్ బాబులో నరనరాన దేశభక్తి కనిపించేదని, దేశం కోసం నాకు ఏదైనా జరిగినా గర్వపడాలని తమకు ధైర్యం చెప్పేవాడని అన్నారు.

గల్వాన్ లోయలో చైనా దొంగదెబ్బతో వీరమరణం పొందిన కర్నల్​ సంతోశ్​ బాబు కుటుంబానికి భారత ఆర్మీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.​ సూర్యాపేటలో సంతోశ్​ బాబు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి పరామర్శించారు. కర్నల్​.. ఏ లక్ష్యం కోసమైతే ప్రాణత్యాగం చేశారో ఆయన లక్ష్యం సాధించేందుకు ప్రధానమంత్రి మోడీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. చైనా వస్తువులను బహిష్కరించాలని మంత్రి సూచించారు.

కర్నల్​ కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుద్​నుతో మాట్లాడారు. కోరుకొండ సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ సమయాల్లో సంతోశ్ బాబు నైపుణ్యాన్ని ఫోటో ఆల్బమ్ తెప్పించుకొని తిలకించారు. చిన్ననాటినుంచే సైనికుడిని చేయాలన్నా తన ఆకాంక్ష మేరకే తన కుమారుడు కోరుకొండ సైనిక్ స్కూల్​లో తొలి ప్రయత్నంలోనే అడ్మిషన్ సాధించాడని సంతోశ్​ బాబు తండ్రి ఉపేందర్ మంత్రికి వివరించారు. సంతోష్ బాబులో నరనరాన దేశభక్తి కనిపించేదని, దేశం కోసం నాకు ఏదైనా జరిగినా గర్వపడాలని తమకు ధైర్యం చెప్పేవాడని అన్నారు.

ఇదీ చూడండి: శ్రీనగర్​ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ముష్కరులు హతం

Last Updated : Jun 21, 2020, 9:42 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.