సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీతోపాటు, పలు గ్రామాల్లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు నిరాడంబరంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్.. నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు నివాసాలపై జెండా ఎగురవేసి వేడుకలు చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ పాల్గొన్నారు.
నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు - TRS party Formation Day celebrations in Thirumalagiri, Suryapet district
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ జెండా ఎగురవేశారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు.

నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీతోపాటు, పలు గ్రామాల్లో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు నిరాడంబరంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్.. నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు నివాసాలపై జెండా ఎగురవేసి వేడుకలు చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ పాల్గొన్నారు.