సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆలయ పూజారులే స్వామివారికి ఏకాదశి పూజలు నిర్వహించనున్నారు.
మట్టపల్లి క్షేత్రంలో ఏకాదశి దర్శనాలు నిలిపివేత
సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనసింహ స్వామి దేవస్థానంలో భక్తల దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
![మట్టపల్లి క్షేత్రంలో ఏకాదశి దర్శనాలు నిలిపివేత toli yekadashi darshanas stoped for devotees due to corona at mattapalli temple in suryapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7828444-780-7828444-1593498153437.jpg?imwidth=3840)
గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. దీనికి ప్రజలంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా
సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆలయ పూజారులే స్వామివారికి ఏకాదశి పూజలు నిర్వహించనున్నారు.
గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. దీనికి ప్రజలంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా