ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఈనాడు విలేకరి మృతి

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో.. ద్విచక్రవాహనాన్ని ఓకారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణాజిల్లా మగ్గోలు గ్రామానికి చెందిన ఈనాడు విలేకరి గోపీ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jun 12, 2020, 8:40 PM IST

The accident occurred in the suburb of Kodada Mandal Redkunta village
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీ కొట్టిన ఘటనలో ఓవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా ఈనాడు విలేకరి మృతి..

మృతుడు కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మగ్గోలు గ్రామానికి చెందిన ఈనాడు విలేఖరి గోపీగా పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై బంధువుతో కలిసి పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.

ఢీ కొట్టింది పంచాయతీ అధికారి కారు..

ప్రమాదానికి కారణమైన కారు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పంచాయతీ అధికారి జగదీశ్​ వాహనంగా పోలీసులు గుర్తించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి

ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీ కొట్టిన ఘటనలో ఓవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా ఈనాడు విలేకరి మృతి..

మృతుడు కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మగ్గోలు గ్రామానికి చెందిన ఈనాడు విలేఖరి గోపీగా పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై బంధువుతో కలిసి పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని పోలీసులు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు.

ఢీ కొట్టింది పంచాయతీ అధికారి కారు..

ప్రమాదానికి కారణమైన కారు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పంచాయతీ అధికారి జగదీశ్​ వాహనంగా పోలీసులు గుర్తించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా మహమ్మారికి చిక్కి పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.