ETV Bharat / state

విద్యుత్ బిల్లులు సవరించాలని కోరుతూ సీపీఐ ఆందోళన - సూర్యాపేట జిల్లా కోదాడలో సీపీఐ కార్యకర్తల ధర్నా

సూర్యాపేట జిల్లా కోదాడలో విద్యుత్ బిల్లులను సవరించాలంటూ సీపీఐ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 1500 రూపాయలను రాబట్టేందుకే బిల్లులు ఎక్కువ చేశారని ఆరోపించారు.

cpi leaders protest in suryapeta
విద్యుత్ బిల్లులు సవరించాలంటూ సీపీఐ నేతల ఆందోళన
author img

By

Published : Jun 15, 2020, 5:17 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోదాడ ట్రాన్స్​కో ఏడిఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద ప్రజలకు రావాల్సిన బిల్లులకంటే అధిక బిల్లులు రావడం వల్ల వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వం అందించిన 1500 రూపాయలను తిరిగి రాబట్టడానికే అధిక విద్యుత్ బిల్లులు వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే విద్యుత్ బిల్లులను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ ఏఈ సైదాకు వినితిపత్రం అందజేశారు.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో సీపీఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోదాడ ట్రాన్స్​కో ఏడిఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద ప్రజలకు రావాల్సిన బిల్లులకంటే అధిక బిల్లులు రావడం వల్ల వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వం అందించిన 1500 రూపాయలను తిరిగి రాబట్టడానికే అధిక విద్యుత్ బిల్లులు వేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే విద్యుత్ బిల్లులను సవరించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ ఏఈ సైదాకు వినితిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.