ETV Bharat / state

చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం - బక్రీద్​ పండుగ

పాఠశాలలో చదువుకోవడం ఇష్టం లేదంటూ ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Aug 20, 2019, 12:00 AM IST

చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని మట్టంపల్లి మండలం రఘునాధపాలెంకు చెందిన ఎస్కే సమీర్​ ఏడో తరగతి చదువుతున్నాడు. బక్రీద్​ పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి.. తండ్రి సైదావలితో కలిసి సోమవారం పాఠశాలకు తిరిగి వచ్చాడు. ఆ పాఠశాలలో చదువుకోవడం ఇష్టం లేదంటూ తండ్రితో వాగ్వాదానికి దిగి.. హుటాహుటిన మొదటి అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకాడు. దీనితో విద్యార్థి కాలుకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి సీఐ శ్రీరాములు అయోధ్య పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి: కేసీఆర్​ కిట్​... అమ్మకు అందని ఆసరా

చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని మట్టంపల్లి మండలం రఘునాధపాలెంకు చెందిన ఎస్కే సమీర్​ ఏడో తరగతి చదువుతున్నాడు. బక్రీద్​ పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి.. తండ్రి సైదావలితో కలిసి సోమవారం పాఠశాలకు తిరిగి వచ్చాడు. ఆ పాఠశాలలో చదువుకోవడం ఇష్టం లేదంటూ తండ్రితో వాగ్వాదానికి దిగి.. హుటాహుటిన మొదటి అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి కిందికి దూకాడు. దీనితో విద్యార్థి కాలుకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తుంగతుర్తి సీఐ శ్రీరాములు అయోధ్య పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి: కేసీఆర్​ కిట్​... అమ్మకు అందని ఆసరా

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.Body:*పాఠశాల మొదటి అంతస్తు భవనం నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం.*

బక్రీద్ పండుగ సెలవులలో స్వగ్రామానికి వెళ్లిన ఓ విద్యార్థి తనతండ్రితో కలిసి ఈ రోజు పాఠశాలకు చేరుకున్న అనంతరం ఈ పాఠశాలలో చదువుకోవడం తనకు ససేమిర ఇష్టం లేదంటూ పాఠశాల మొదటి అంతస్తుపై ఎక్కి అక్కడినుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి తోటి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామానికి చెందిన SK సమీర్ ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి చదవడానికి తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశం పొందాడు.
ఇటీవల పాఠశాలకు బక్రీద్ పండుగ సెలవులు ప్రకటించడంతో స్వగ్రామానికి వెళ్లిన సమీర్ తన తండ్రి సైదావలితో కలిసి ఈ రోజు పాఠశాలకు చేరుకున్నారు. పాతశాలకు చేరుకున్న కొద్ది సమయంలోనే ఈ పాఠశాలలో చదవడం తనకు ససేమిరా ఇష్టం లేదంటూ తండ్రితో వాగ్వాదానికి దిగి హుటాహుటిన మొదటి అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడు.
దీంతో అతడి కాలుకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్ లో మెరుగైన చికిత్స కోసం సూర్యాపేటకు తరలించారు.
విషయం తెలుసుకున్న తుంగతుర్తి CI శ్రీరాముల అయోధ్య, SI శ్రీకాంత్ గౌడ్ లు పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.