ETV Bharat / state

ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే కిషోర్​కుమార్​

author img

By

Published : Nov 6, 2020, 11:10 AM IST

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

mla kishore kumar opened grain purchasing centers at tungaturthi in suryapet district
ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: ఎమ్మెల్యే కిషోర్​కుమార్​

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, కొత్తగూడెం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గాదరి కిషోర్​కుమార్​ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1888 , బీ గ్రేడ్ ధాన్యానికి 1868 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకోవాలని.. మధ్య దళారులకు అమ్ముకొని మోసపోవద్దని సూచించారు.

రైతు శ్రేయస్సు కొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎస్​.ఏ. రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర వెంకన్న, పలువురు గ్రామసర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ధాన్యంలో తేమతో మద్దతు ధర రాక రైతుల ఇబ్బందులు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, కొత్తగూడెం, మద్దిరాల, జాజిరెడ్డిగూడెం మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గాదరి కిషోర్​కుమార్​ ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1888 , బీ గ్రేడ్ ధాన్యానికి 1868 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకోవాలని.. మధ్య దళారులకు అమ్ముకొని మోసపోవద్దని సూచించారు.

రైతు శ్రేయస్సు కొరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు ఎస్​.ఏ. రజాక్, ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర వెంకన్న, పలువురు గ్రామసర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ధాన్యంలో తేమతో మద్దతు ధర రాక రైతుల ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.