వచ్చే ఏడాది నుంచి సూర్యాపేట జిల్లాలోని 2 పంటలకు నీరిచ్చేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి వెల్లడించారు. చివ్వెల మండలం ఐలాపురంలోని చెరువులో కార్తిక దీపారాధన నిర్వహించారు. గ్రామస్థులతో కలిసి గోదావరికి మంత్రి జలహారతి ఇచ్చారు. ఈ ఏడాది చెరువులకు మాత్రమే అందుతున్న గోదావరి జలాలు... వచ్చే ఏడు నుంచి ప్రతి పొలానికి అందించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ సీజన్లో జిల్లాలోని ప్రతి చెరువును గోదావరి నీటితో నింపుతామన్నారు.
సూర్యాపేట జిల్లాకు నీరు అందించే లక్ష్మీకాలువకు సంబంధించి 7 మోటార్లు విజయవంతంగా నీటిని ఎత్తిపోస్తున్నాయన్నారు. రైతు ముఖాల్లో ఆనందం చూడాలన్నా సీఎం కేసీఆర్ కల నెరవేరబోతోందని మంత్రి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం