ETV Bharat / state

Current Shock: కరెంట్ షాక్​తో వ్యక్తి మృతి, కన్నీటి సంద్రంలో కుటుంబీకులు

author img

By

Published : Jun 8, 2021, 4:30 PM IST

విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా చిన్నెమిల సమీపంలోని చాముల్​ తండాలో ఈ ప్రమాదం జరిగింది.

man died with current shock in suryapet district chamul thanda
కరెంట్ షాక్​తో వ్యక్తి మృతి, కన్నీటి సంద్రంలో కుటుంబీకులు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్నెమిల గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. చిన్నెమిల సమీపంలోని చాముల్ తండాకు చెందిన బానోతు వత్నం (45) ఇంట్లో కరెంటు షాక్​తో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని గ్రామస్థులు తెలిపారు.

బానోతు వత్నం మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబపెద్ద ప్రాణాలు కోల్పోవడం తమను దిక్కుతోచని స్థితిలో పడేసిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్నెమిల గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. చిన్నెమిల సమీపంలోని చాముల్ తండాకు చెందిన బానోతు వత్నం (45) ఇంట్లో కరెంటు షాక్​తో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని గ్రామస్థులు తెలిపారు.

బానోతు వత్నం మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబపెద్ద ప్రాణాలు కోల్పోవడం తమను దిక్కుతోచని స్థితిలో పడేసిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.