ETV Bharat / state

'700 మంది కాదు... కేసీఆర్​ దిగొచ్చినా కాంగ్రెస్​దే విజయం' - huzurnagar by election news

తెరాస ప్రభుత్వం ఐదేళ్లలో హుజూర్​నగర్​  నియోజకవర్గానికి ఒక ఎకరానికైనా సాగు,తాగు నీరు అందించిందా అని మాజీ మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీ రూ.3 లక్షల కోట్ల అప్పు చేసి మూడు ఇళ్లు కూడా కట్టలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ఎద్దేవా చేశారు.

huzurnagar by election congress sabha
author img

By

Published : Sep 30, 2019, 10:57 PM IST

'700 మంది కాదు... కేసీఆర్​ దిగొచ్చిన ఏం కాదు'

రాష్ట్రంలో ఎత్తిపోతల ద్వారా మెుత్తం 3.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తే...అందులో ప్రత్యేకంగా హుజూర్​నగర్​కు 55 వేల ఎకరాలకు నీరందించిన ఘనత కాంగ్రెస్​దని మాజీ మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. తెరాస నేతలు బూటకపు మాటలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. అహంకారంతో రాజ్యమేలాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 700 మంది కాదు... కేసీఆర్​ దిగొచ్చిన ఏం కాదని తెలిపారు. హుజూర్​నగర్​ ఉపఎన్నిక నియంత కేసీఆర్‌, 4 కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోటీ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుక లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వెంకట్​ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:పద్మావతి గెలవకపోతే ఏ శిక్షకైనా సిద్ధమే..: ఉత్తమ్

'700 మంది కాదు... కేసీఆర్​ దిగొచ్చిన ఏం కాదు'

రాష్ట్రంలో ఎత్తిపోతల ద్వారా మెుత్తం 3.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తే...అందులో ప్రత్యేకంగా హుజూర్​నగర్​కు 55 వేల ఎకరాలకు నీరందించిన ఘనత కాంగ్రెస్​దని మాజీ మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. తెరాస నేతలు బూటకపు మాటలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. అహంకారంతో రాజ్యమేలాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 700 మంది కాదు... కేసీఆర్​ దిగొచ్చిన ఏం కాదని తెలిపారు. హుజూర్​నగర్​ ఉపఎన్నిక నియంత కేసీఆర్‌, 4 కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోటీ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుక లేకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని వెంకట్​ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి:పద్మావతి గెలవకపోతే ఏ శిక్షకైనా సిద్ధమే..: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.