సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో రాత్రి కురిసిన వర్షానికి చెరువులు అలుగులు పోశాయి. వాగులు, పిల్ల కాలువలు నీటితో నిండడం వల్ల జలకళ సంతరించుకుంది. జిల్లాలోనే నడిగూడెం మండలంలో అత్యధికంగా వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
నడిగూడెం మండలంలో పత్తి, వరిపంట నీట మునగగా, అనంతగిరి మండలంలో అత్యధికంగా నారుమడులు మునిగిపోయాయి. దానితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం.. తడిసి ముద్దయిన జనం