సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఆడిపాడారు. వృద్ధాప్యంలో పిల్లలతో గడపడం కంటే మరే ఆస్తి అవసరం లేదని వృద్ధులు అభిప్రాయ పడ్డారు.
తల్లిదండ్రుల ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలకు, పెద్దలు దూరమవుతున్నారని ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి పేర్కొన్నారు. నేటి తరానికి ఉమ్మడి కుటుంబం, సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.