ETV Bharat / state

గుర్రంబోడు రైతులకు న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి

author img

By

Published : Feb 12, 2021, 12:22 PM IST

గుర్రంబోడు తండా రైతులకు న్యాయం చేయాలని కోరుతూ గిరిజన సంఘాల జేఏసీ నేతలు.. మంత్రి సత్యవతి రాఠోడ్​ను ఆమె నివాసంలో కలిశారు. నాగార్జున సాగర్​ నిర్మాణ సమయంలో గిరిజనులకు పునరావాసం కింద ప్రభుత్వం భూములిచ్చిందని.. కానీ ఆ భూములను ఓ వ్యక్తి తన పేరున రాయించుకున్నారని మంత్రికి తెలిపారు.

minister sathyavathi rathode, girijana jac leaders
మంత్రి సత్యవతి రాఠోడ్​, గిరిజన సంఘాల జేఏసీ

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు తండా రైతులకు న్యాయం చేయాలని.. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ను గిరిజన సంఘాల జేఏసీ నేతలు కోరారు. మంత్రిని హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గిరిజనులకు పునరావాసం కింద ప్రభుత్వం భూములిచ్చిందని నేతలు పేర్కొన్నారు. ఆ భూములను ఓ వ్యక్తి తన పేరున రాయించుకుని మోసం చేశారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

గుర్రంబోడు గిరిజన రైతుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సత్యవతి హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు.

సూర్యాపేట జిల్లా గుర్రంబోడు తండా రైతులకు న్యాయం చేయాలని.. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ను గిరిజన సంఘాల జేఏసీ నేతలు కోరారు. మంత్రిని హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో కలిసి విజ్ఞప్తి చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గిరిజనులకు పునరావాసం కింద ప్రభుత్వం భూములిచ్చిందని నేతలు పేర్కొన్నారు. ఆ భూములను ఓ వ్యక్తి తన పేరున రాయించుకుని మోసం చేశారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

గుర్రంబోడు గిరిజన రైతుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సత్యవతి హామీ ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి: మంత్రి శ్రీనివాస్​గౌడ్​, సీపీ అంజనీకుమార్ టగ్ ఆఫ్ వార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.