సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సై రవీందర్ హాజరయ్యారు.
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్నారు. సక్రమ మార్గంలో తమ ఓటు వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. ఓటు హక్కు ఆవశ్యకతపై పలువురు విద్యార్థులు మాట్లాడారు.