సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.
సయ్యద్ దావూద్(52 )తన కోళ్ల ఫారంలో విద్యుత్ బల్బు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇదీ చూడండి : "నువ్వు నేను ఒకటట.. మన కీర్తి ఘనమట"