ETV Bharat / state

విద్యుత్​ బిల్లులు మాఫీ చేయాలని నిరసన

విద్యుత్​ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్​ చేస్తూ హుజూర్​నగర్​లోని డీఈ కార్యాలయం ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వెంటనే మూడు నెలల బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్​ చేశారు.

author img

By

Published : Jun 16, 2020, 4:07 PM IST

cpi leaders Protest to waive electricity bills in suryapet district
విద్యుత్​ బిల్లులు మాఫీ చేయాలని నిరసన

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డీఈ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఈ శ్రీనివాస్​కు వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ బిల్లులు వెంటనే మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు డిమాండ్​ చేశారు.

కరోనా సమయంలో 3 నెలల బిల్లులకు సంబంధించి ఒకేసారి రీడింగ్ తీయడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చిందని అన్నారు. ఈ 3 నెలల బిల్లులు ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డీఈ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఈ శ్రీనివాస్​కు వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ బిల్లులు వెంటనే మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు డిమాండ్​ చేశారు.

కరోనా సమయంలో 3 నెలల బిల్లులకు సంబంధించి ఒకేసారి రీడింగ్ తీయడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చిందని అన్నారు. ఈ 3 నెలల బిల్లులు ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: మద్యం రవాణా... సరిహద్దులో ఉరుకులు పరుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.