ETV Bharat / state

విషపు కాటుకు గురైతే.. కరోనా సోకిందని గుసగుసలు - సూర్యాపేట జిల్లా మద్దిరాలలో కరోనా పుకార్లు తాజా వార్త

మంచి మాట బాధలను సైతం తొలగించి ఓదార్పునిస్తుంది. కానీ ఆరోపణలు, వెటకారపు మాటలు లాంటివి ఎంతటి ఆరోగ్యవంతుడినైనా మానసికంగా దెబ్బతీస్తాయనడానికి సూర్యాపేట జిల్లా మద్దిరాలలోని ఓ బాలుడిపై గ్రామస్థులు లేపిన పుకార్లు చక్కని నిరద్శనంగా కనిపిస్తున్నాయి. విషపు పురుగు కాటుకు గురైన చిన్నారికి కరోనా సోకిందని స్థానికుల గుసగుసలు తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నయని బాధితుని తల్లిదండ్రులు వాపోతున్నారు.

Breaking News
author img

By

Published : Aug 8, 2020, 2:02 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన మల్లారపు వెంకన్న-చైతన్యల రెండో కుమారుడు దీక్షత్. బుధవారం రాత్రి విషపురుగు కాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడుకి చూపిస్తే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్ తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. హైదరాబాద్​లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా గ్రామస్థులు దీక్షిత్​కి కరోనా సోకిందని పుకార్లు లేపారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారుడిని కాపాడుకోవడం కోసం తీవ్ర అవస్థలు పడుతూ ఉంటే గ్రామస్థుల మాటలు తామను మానసిక వేదనకు గురిచేస్తోన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానికులు విషయం తెలుసుకుని మనోధైర్యం కలిపిచాలని వారు కోరుతున్నారు.

సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామానికి చెందిన మల్లారపు వెంకన్న-చైతన్యల రెండో కుమారుడు దీక్షత్. బుధవారం రాత్రి విషపురుగు కాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడుకి చూపిస్తే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్ తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. హైదరాబాద్​లోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా గ్రామస్థులు దీక్షిత్​కి కరోనా సోకిందని పుకార్లు లేపారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారుడిని కాపాడుకోవడం కోసం తీవ్ర అవస్థలు పడుతూ ఉంటే గ్రామస్థుల మాటలు తామను మానసిక వేదనకు గురిచేస్తోన్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానికులు విషయం తెలుసుకుని మనోధైర్యం కలిపిచాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండిః ఇరుకు ఇళ్లలోనే ఐసోలేషన్.. బాధితుల్లో మస్తు పరేషాన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.