సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని వల్ల విద్యుత్ తీగలు తగిలి... సుమారు రూ. 3 లక్షల విలువ చేసే ఆరు గేదెలు విద్యుదాఘాతంతో మరణించాయి. తమకు జీవనాధారమైన గేదెలు మృతి చెందగా... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరారు.
ప్రభుత్వం ఈ విషయంలో తూతూమంత్రంగా వ్యవహరించకుండా రైతులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించాలని జడ్పీటీసీ కడియం ఇందిరా డిమాండ్ చేశారు. మంగళవారం కురిసిన వానకు చాలా చోట్ల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడి పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వీఆర్వో తెలిపారు.