సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అజ్మీరా తండాలో ప్రకృతి వనాన్ని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ప్రకృతి వనంతో పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
పట్టణాలలోని పార్కులకు ధీటుగా ప్రకృతి వనాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామల్లోని ప్రజలు ప్రకృతి వనాలను ఉపయోగించుకోవాలని సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామాాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మిస్తున్నామని చెప్పారు.
ఇవీ చూడండి: రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ