ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్​.. ఒకరు దుర్మరణం - accidents near mallanna sagar

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ శివారులో అతివేగంగా వచ్చిన టిప్పర్​ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం చెందాడు.

tipper hits bike one died at spot in siddipet
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్​.. ఒకరు దుర్మరణం
author img

By

Published : Mar 1, 2020, 11:52 PM IST

సిద్దిపేట జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. నాలుగు రోజుల కిందట ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం ఆ ప్రాంతవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొన్న ఘటనలో చప్యాలకు చెందిన రొడ్డ పరశురాములు అక్కడికక్కడే మృతిచెందాడు. గజ్వేల్​ నుంచి ఇంటికి తిరిగివెళ్తుండగా అతివేగంగా వచ్చిన టిప్పర్​ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. పరశురాములు కాళ్లు పైనుంచి టిప్పర్​ వెళ్లడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి మృతిచెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతునికి భార్య ఇందిర, కుమారుడు కార్తీక్ ఉన్నారు. బాధితుల రోదనలు అక్కడున్నవారిని కూడా కంటతడి పెట్టించాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన గజ్వేల్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్​.. ఒకరు దుర్మరణం

ఇవీచూడండి: కారు, బైక్​ ఢీ... ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. నాలుగు రోజుల కిందట ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం ఆ ప్రాంతవాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొన్న ఘటనలో చప్యాలకు చెందిన రొడ్డ పరశురాములు అక్కడికక్కడే మృతిచెందాడు. గజ్వేల్​ నుంచి ఇంటికి తిరిగివెళ్తుండగా అతివేగంగా వచ్చిన టిప్పర్​ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. పరశురాములు కాళ్లు పైనుంచి టిప్పర్​ వెళ్లడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి మృతిచెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతునికి భార్య ఇందిర, కుమారుడు కార్తీక్ ఉన్నారు. బాధితుల రోదనలు అక్కడున్నవారిని కూడా కంటతడి పెట్టించాయి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన గజ్వేల్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్​.. ఒకరు దుర్మరణం

ఇవీచూడండి: కారు, బైక్​ ఢీ... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.