ETV Bharat / state

గజ్వేల్​... అభివృద్ధికి తార్కాణం

గజ్వేల్ అభివృద్ధిని చూసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు అబ్బురపడ్డారు. ఈ నియోజకవర్గం దేశానికే ఆదర్శమని కితాబిచ్చారు. పట్టణాభివృద్ధిపై ప్రగతి భవన్​లో ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం.. క్షేత్ర పర్యటన కోసం గజ్వేల్​కు వెళ్లారు. గత ఐదేళ్లలో గజ్వేల్​లో చేసిన అభివృద్ధి.. తీసుకొచ్చిన మార్పును ఆర్థిక మంత్రి హరీశ్​ రావు వివరించారు.

author img

By

Published : Feb 19, 2020, 5:04 AM IST

Updated : Feb 19, 2020, 7:12 AM IST

telangana ministers and officers visited gajwel in siddipet district
గజ్వేల్​... అభివృద్ధికి తార్కాణం
గజ్వేల్​... అభివృద్ధికి తార్కాణం

పట్టణాభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పురపాలక ఛైర్మన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో గజ్వేల్​లో చేపట్టిన అభివృద్ధి పనులు వారికి వివరించారు. గజ్వేల్ స్ఫూర్తితో ఇతర ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టించాలని కేసీఆర్ సూచించారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి సిద్దిపేట జిల్లాకు చేరుకున్న ప్రతినిధుల బృందం.. మొదట సింగాయపల్లి వద్ద చేపట్టిన అటవీ పునరుజ్జీవనాన్ని పరిశీలించింది. అటవీ పునరుజ్జీవనం చేసిన విధానాన్ని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మంత్రి హరీశ్ రావు వివరించారు.

మార్కెట్​లో కలియతిరిగిన బృందం

సమీకృత మార్కెట్​కు చేరుకున్న ప్రతినిధుల బృందానికి మంత్రి హరీశ్ రావు ఆహ్వానం పలికారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మార్కెట్ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. అమ్మకందారులు, కొనుగోలుదారుల అనుభవాలు తెలుసుకున్నారు. కొంత మంది మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కూరగాయలు, పండ్లు కోనుగోలు చేశారు.

జిమ్​లో కసరత్తులు

అనంతరం వైకుంఠధామానికి చేరుకున్నారు. అక్కడి పరిసరాలు చూసిన బృంద సభ్యులు ఆశ్యర్యపోయారు. శ్మశానం పార్కును తలపిస్తోందన్నారు. అక్కడి నుంచి సంగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్​ను సందర్శించారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్య వాతవారణం నేపథ్యంలో అర్బన్ పార్కుల ఏర్పాటు అవశ్యకత గురించి తెలుసుకున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్​లో మంత్రులు హరీశ్​ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కసరత్తులు చేశారు.

గజ్వేల్ స్ఫూర్తితో తమ ప్రాంతంలోనూ అభివృద్ధి పనులు చేపడతామని.. ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని ప్రజా ప్రతినిధులు తెలిపారు.

ఇవీ చూడండి: దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

గజ్వేల్​... అభివృద్ధికి తార్కాణం

పట్టణాభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పురపాలక ఛైర్మన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో గజ్వేల్​లో చేపట్టిన అభివృద్ధి పనులు వారికి వివరించారు. గజ్వేల్ స్ఫూర్తితో ఇతర ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టించాలని కేసీఆర్ సూచించారు. అనంతరం ప్రగతి భవన్ నుంచి సిద్దిపేట జిల్లాకు చేరుకున్న ప్రతినిధుల బృందం.. మొదట సింగాయపల్లి వద్ద చేపట్టిన అటవీ పునరుజ్జీవనాన్ని పరిశీలించింది. అటవీ పునరుజ్జీవనం చేసిన విధానాన్ని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మంత్రి హరీశ్ రావు వివరించారు.

మార్కెట్​లో కలియతిరిగిన బృందం

సమీకృత మార్కెట్​కు చేరుకున్న ప్రతినిధుల బృందానికి మంత్రి హరీశ్ రావు ఆహ్వానం పలికారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు మార్కెట్ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. అమ్మకందారులు, కొనుగోలుదారుల అనుభవాలు తెలుసుకున్నారు. కొంత మంది మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కూరగాయలు, పండ్లు కోనుగోలు చేశారు.

జిమ్​లో కసరత్తులు

అనంతరం వైకుంఠధామానికి చేరుకున్నారు. అక్కడి పరిసరాలు చూసిన బృంద సభ్యులు ఆశ్యర్యపోయారు. శ్మశానం పార్కును తలపిస్తోందన్నారు. అక్కడి నుంచి సంగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్​ను సందర్శించారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్య వాతవారణం నేపథ్యంలో అర్బన్ పార్కుల ఏర్పాటు అవశ్యకత గురించి తెలుసుకున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్​లో మంత్రులు హరీశ్​ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు కసరత్తులు చేశారు.

గజ్వేల్ స్ఫూర్తితో తమ ప్రాంతంలోనూ అభివృద్ధి పనులు చేపడతామని.. ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని ప్రజా ప్రతినిధులు తెలిపారు.

ఇవీ చూడండి: దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

Last Updated : Feb 19, 2020, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.