ETV Bharat / state

'అత్యవసరమైతే ఈ-పాసులు జారీ చేస్తాం'

లాక్​డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లాల్సిన వారికి ప్రత్యేక పాసులు జారీ చేస్తామని సిద్దిపేట కమిషనర్ తెలిపారు. అందుకు వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.

author img

By

Published : May 12, 2021, 6:28 PM IST

siddipet commissioner about special pass, siddipet commissioner on pass
ఈ పాసులపై కమిషనర్ వ్యాఖ్యలు. ఈ పాసులపై సిద్దిపేట కమిషనర్ వ్యాఖ్యలు

లాక్​డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ లేదా మరేదైనా అత్యవసరమైతే వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు జారీ చేస్తామని సిద్దిపేట కమిషనర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందజేసే ఈ-పాసులకు https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్​సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చే వారికి సంబంధిత రాష్ట్రాలు పాసు​లు జారీ చేస్తాయని తెలిపారు. ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా వెబ్​సైట్ ద్వారానే ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్నవారికి కమిషనర్ కార్యాలయం నుంచి పాసులు జారీ చేస్తామని తెలిపారు. పాస్​ను ప్రింట్ తీసుకొని సంబంధిత వాహనాలకు ముందు అద్దం ఎడమవైపు అతికించుకోవాలని సూచించారు. ఎవరూ కమిషనరేట్​కు రావొద్దని ఆదేశించారు.

లాక్​డౌన్ నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ లేదా మరేదైనా అత్యవసరమైతే వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు జారీ చేస్తామని సిద్దిపేట కమిషనర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందజేసే ఈ-పాసులకు https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్​సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చే వారికి సంబంధిత రాష్ట్రాలు పాసు​లు జారీ చేస్తాయని తెలిపారు. ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా వెబ్​సైట్ ద్వారానే ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్నవారికి కమిషనర్ కార్యాలయం నుంచి పాసులు జారీ చేస్తామని తెలిపారు. పాస్​ను ప్రింట్ తీసుకొని సంబంధిత వాహనాలకు ముందు అద్దం ఎడమవైపు అతికించుకోవాలని సూచించారు. ఎవరూ కమిషనరేట్​కు రావొద్దని ఆదేశించారు.

ఇదీ చదవండి: త్వరలో కొవాగ్జిన్ ఉత్పత్తి రెట్టింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.