ETV Bharat / state

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం

author img

By

Published : Aug 22, 2020, 9:03 PM IST

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ద్విచక్రవాహనం ఢీ కొనడం వల్ల వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ‌

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం

సిద్దిపేట పట్టణం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన పొన్నాల రాజమల్లు శ్రీనివాస థియేటర్ ఎదురుగా గల ఇనుప కంచె మధ్యలోంచి వచ్చి రోడ్డు దాటే సమయంలో... పాత బస్టాండ్ నుంచి హైదరాబాద్ రోడ్డు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఒక్కసారిగా ఢీకొంది. దీంతో రోడ్డు దాటుతున్న రాజమల్లు అక్కడికక్కడే మృతి చెందాడు.

టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ‌ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

సిద్దిపేట పట్టణం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన పొన్నాల రాజమల్లు శ్రీనివాస థియేటర్ ఎదురుగా గల ఇనుప కంచె మధ్యలోంచి వచ్చి రోడ్డు దాటే సమయంలో... పాత బస్టాండ్ నుంచి హైదరాబాద్ రోడ్డు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఒక్కసారిగా ఢీకొంది. దీంతో రోడ్డు దాటుతున్న రాజమల్లు అక్కడికక్కడే మృతి చెందాడు.

టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ‌ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఈగ ఫిక్షనల్‌.. ఎలుక ఒరిజినల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.