సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మొదటి రోజు భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్రావు సంఘీభావం తెలిపారు. రైతులకు అందిస్తున్న రైతు బీమా లాగానే ప్రతి చేనేత కార్మికునికి రూ. ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని రఘునందన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం అమలు చేస్తున్న చేనేత బంధు పథకాన్ని తెలంగాణలోనూ కేసీఆర్ సర్కారు వెంటనే అమలు చేయాలని రఘునందన్రావు కోరారు. ప్రతి చేనేత కుటుంబానికి వ్యాపార అభివృద్ధి కోసం వ్యక్తిగత రుణాలను ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయాలన్నారు.
ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్లు: కేసీఆర్