ETV Bharat / state

కాళేశ్వరం విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవని పిటిషన్ - కాళేశ్వరం ప్రాజెక్టు కేసులు

కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో వేములఘాట్‌ రైతులు పిటిషన్‌ వేశారు. పర్యావరణ అనుమతులు లేవని పేర్కొన్నారు. అనుమతులు పొందేవరకు పనులు ఆపేలా చూడాలని కోరారు. విచారించిన ఎన్జీటీ తదుపరి విచారణను ఆగస్టు 5 కు వాయిదా వేసింది.

kaleshwaram
kaleshwaram
author img

By

Published : Jul 22, 2020, 1:18 PM IST

కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవని వేములఘాట్‌ రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే రూ.21 వేల కోట్ల పనులు చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అనుమతులు పొందేవరకు పనులు ఆపేలా చూడాలని కోరారు.

కాళేశ్వరంపై ఎన్జీటీ ప్రధాన బెంచ్‌లో విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషన్ల విచారణపై స్పష్టత ఇవ్వాలని దిల్లీలోని ప్రధాన బెంచ్‌ను చెన్నై ఎన్జీటీ బెంచ్ కోరింది. తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేసింది.

కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవని వేములఘాట్‌ రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే రూ.21 వేల కోట్ల పనులు చేపట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అనుమతులు పొందేవరకు పనులు ఆపేలా చూడాలని కోరారు.

కాళేశ్వరంపై ఎన్జీటీ ప్రధాన బెంచ్‌లో విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషన్ల విచారణపై స్పష్టత ఇవ్వాలని దిల్లీలోని ప్రధాన బెంచ్‌ను చెన్నై ఎన్జీటీ బెంచ్ కోరింది. తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.