ETV Bharat / state

నెల రోజులుగా పైప్​లైన్​ లీక్​.. పట్టించుకోని అధికారులు

author img

By

Published : Dec 10, 2020, 8:04 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం, మహ్మదాపూర్​లలో నెల రోజులుగా మిషన్ భగీరథ పైప్​లైన్​ లీక్​ అవుతున్నా.. అధికారులు సరి చేయించడం లేదని రైతులు వాపోతున్నారు. బురదతో నిండిన రోడ్డుపై పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందన్నారు. ధాన్యాన్ని మార్కెట్​కు సరఫరా చేయడానికి, వాహనాల రాకపోకలకు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

mission-bhagiratha-pipeline-leake-at-husnabad-mandal
నెల రోజులుగా పైప్​లైన్​ లీక్​.. పట్టించుకోని అధికారులు

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు అందించడానికి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పలుచోట్ల నీరుగారుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం, మహ్మదాపూర్ గ్రామాల సమీపంలో మిషన్ భగీరథ పైప్​లైన్లు నెల రోజులుగా లీక్​ అవుతున్నాయి. నీరు వృథాగా పోతున్నప్పటికీ అధికారులు సరి చేయించడం లేదు.

నాగారం సమీపంలో ప్రధాన రహదారి పక్కనే నెల రోజులకు పైగా పైప్​లైన్ లీకేజీ అవుతూ చిన్న కుంట ఏర్పడటం గమనార్హం. మహ్మదాపూర్ గ్రామ సమీపంలో రైతులు పంట పొలాలకు వెళ్లే దారిలో పైప్​లైన్ లీక్​ వల్ల రహదారి చిత్తడిగా మారింది. బురదతో నిండిన రోడ్డుపై పంట పొలాలకు వెళ్లడానికి, ధాన్యాన్ని మార్కెట్​కు సరఫరా చేయడానికి, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

" గతంలో మిషన్ భగీరథ అధికారులకు సమస్యను తెలియజేశాం. వారు పైప్​లైన్ మరమ్మతులు చేయడానికి వచ్చారు. పైప్​లైన్ ఉన్న పంట పొలనికి చెందిన రైతు తనకు నష్టమవుతుందని చెప్పడంతో అధికారులు వెళ్లిపోయారు. ప్రస్తుతం పైప్​లైన్ మరమ్మతుకు ఎలాంటి అడ్డంకులు లేవు. అధికారులకు, సర్పంచ్​కు తెలియజేసినప్పటికీ మరమ్మత్తు చేయించడం లేదు."

- రైతు

తమ పంట పొలాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లడానికి వచ్చే వాహనాలు బురదలో బోల్తా పడిన సందర్భాలూ ఉన్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి పైప్​లైన్​కు త్వరగా బాగు చేయించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'సిద్దిపేట లేకపోతే కేసీఆర్​ లేడు.. కేసీఆర్​ లేకపోతే తెలంగాణ లేదు'

రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మంచినీరు అందించడానికి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పలుచోట్ల నీరుగారుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం, మహ్మదాపూర్ గ్రామాల సమీపంలో మిషన్ భగీరథ పైప్​లైన్లు నెల రోజులుగా లీక్​ అవుతున్నాయి. నీరు వృథాగా పోతున్నప్పటికీ అధికారులు సరి చేయించడం లేదు.

నాగారం సమీపంలో ప్రధాన రహదారి పక్కనే నెల రోజులకు పైగా పైప్​లైన్ లీకేజీ అవుతూ చిన్న కుంట ఏర్పడటం గమనార్హం. మహ్మదాపూర్ గ్రామ సమీపంలో రైతులు పంట పొలాలకు వెళ్లే దారిలో పైప్​లైన్ లీక్​ వల్ల రహదారి చిత్తడిగా మారింది. బురదతో నిండిన రోడ్డుపై పంట పొలాలకు వెళ్లడానికి, ధాన్యాన్ని మార్కెట్​కు సరఫరా చేయడానికి, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

" గతంలో మిషన్ భగీరథ అధికారులకు సమస్యను తెలియజేశాం. వారు పైప్​లైన్ మరమ్మతులు చేయడానికి వచ్చారు. పైప్​లైన్ ఉన్న పంట పొలనికి చెందిన రైతు తనకు నష్టమవుతుందని చెప్పడంతో అధికారులు వెళ్లిపోయారు. ప్రస్తుతం పైప్​లైన్ మరమ్మతుకు ఎలాంటి అడ్డంకులు లేవు. అధికారులకు, సర్పంచ్​కు తెలియజేసినప్పటికీ మరమ్మత్తు చేయించడం లేదు."

- రైతు

తమ పంట పొలాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లడానికి వచ్చే వాహనాలు బురదలో బోల్తా పడిన సందర్భాలూ ఉన్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి పైప్​లైన్​కు త్వరగా బాగు చేయించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: 'సిద్దిపేట లేకపోతే కేసీఆర్​ లేడు.. కేసీఆర్​ లేకపోతే తెలంగాణ లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.