ETV Bharat / state

కోమటిచెరువుపై ఆకట్టుకుంటున్న వేలాడే వంతెన - ministers launched bridge at komati cheruvu of sidipet

సిద్దిపేటలో పర్యటక రంగం కొత్త పుంతలు తొక్కనుంది. కోమటిచెరువుపై నిర్మించిన వేలాడే వంతెన సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఏకకాలంలో దాదాపు 200 మంది నిల్చొని ప్రకృతి అందాలను ఆస్వాదించేలా వంతెనను నిర్మించారు. లక్నవరం కన్నా పొడవైన ఈ వంతెనను మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.

కోమటిచెరువుపై ఆకట్టుకుంటున్న వేలాడే వంతెన
కోమటిచెరువుపై ఆకట్టుకుంటున్న వేలాడే వంతెన
author img

By

Published : Dec 2, 2019, 6:16 AM IST

Updated : Dec 2, 2019, 8:47 AM IST

కోమటిచెరువుపై ఆకట్టుకుంటున్న వేలాడే వంతెన

సిద్దిపేట కోమటి చెరువుకు పర్యటక శోభను సంతరించుకుంది. వరంగల్ జిల్లా లక్నవరం వంతెన తరహాలోనే ఈ చెరువుపై వేలాడే వంతెనను నిర్మించారు. లక్నవరం కన్నా 91 మీటర్ల పొడవైన ఈ కోమటి చెరువు వంతెనను మంత్రి హరీశ్‌రావు చొరవతో పర్యటకాభివృద్ధి సంస్థ రూ.6 కోట్లతో నిర్మించింది.

చెరువులో వంద అడుగుల ఎత్తైన 2 పైలాన్ల మధ్యలో గాల్వనైజ్డ్‌ రోప్‌తో 241 మీటర్ల పొడవైన వేలాడే వంతెనను నిర్మించారు. ఇందుకోసం కొరియా నుంచి దిగుమతి చేసుకున్న తాడును ఉపయోగించారు. వంతెన మధ్యలో 4 అడుగుల వెడల్పుతో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో దాదాపు 200 మంది దీనిపై నిల్చొని కోమటిచెరువు అందాలను ఆస్వాదించవచ్చు. మంగళూరుకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత భరద్వాజ్‌ దీన్ని రూపొందించారు.

నూతనంగా నిర్మించిన ఈ వంతెనను మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. కోమటిచెరువు అభివృద్ధి ఏళ్ల కలగా పేర్కొన్న మంత్రి హరీశ్‌... పర్యటక ప్రాంతాన్ని స్వచ్ఛతకు నిలయంగా తీర్చిదిద్దాలని సూచించారు. సిద్దిపేట ప్రజల ఆస్తి అయిన ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

పర్యటకులు టికెట్‌ కొనుగోలు చేసి కోమటి చెరువును సందర్శించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం పూట మార్నింగ్ చేసే వారి కోసం ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లతోపాటు పిల్లల ఆటాపాటల కోసం పార్కులు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్‌ ఫర్‌ దిశ'

కోమటిచెరువుపై ఆకట్టుకుంటున్న వేలాడే వంతెన

సిద్దిపేట కోమటి చెరువుకు పర్యటక శోభను సంతరించుకుంది. వరంగల్ జిల్లా లక్నవరం వంతెన తరహాలోనే ఈ చెరువుపై వేలాడే వంతెనను నిర్మించారు. లక్నవరం కన్నా 91 మీటర్ల పొడవైన ఈ కోమటి చెరువు వంతెనను మంత్రి హరీశ్‌రావు చొరవతో పర్యటకాభివృద్ధి సంస్థ రూ.6 కోట్లతో నిర్మించింది.

చెరువులో వంద అడుగుల ఎత్తైన 2 పైలాన్ల మధ్యలో గాల్వనైజ్డ్‌ రోప్‌తో 241 మీటర్ల పొడవైన వేలాడే వంతెనను నిర్మించారు. ఇందుకోసం కొరియా నుంచి దిగుమతి చేసుకున్న తాడును ఉపయోగించారు. వంతెన మధ్యలో 4 అడుగుల వెడల్పుతో వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. ఏకకాలంలో దాదాపు 200 మంది దీనిపై నిల్చొని కోమటిచెరువు అందాలను ఆస్వాదించవచ్చు. మంగళూరుకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత భరద్వాజ్‌ దీన్ని రూపొందించారు.

నూతనంగా నిర్మించిన ఈ వంతెనను మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. కోమటిచెరువు అభివృద్ధి ఏళ్ల కలగా పేర్కొన్న మంత్రి హరీశ్‌... పర్యటక ప్రాంతాన్ని స్వచ్ఛతకు నిలయంగా తీర్చిదిద్దాలని సూచించారు. సిద్దిపేట ప్రజల ఆస్తి అయిన ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

పర్యటకులు టికెట్‌ కొనుగోలు చేసి కోమటి చెరువును సందర్శించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం పూట మార్నింగ్ చేసే వారి కోసం ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు. సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లతోపాటు పిల్లల ఆటాపాటల కోసం పార్కులు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: పశువైద్యురాలి పేరు ఇకపై 'జస్టిస్‌ ఫర్‌ దిశ'

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_01_MANTRULU PARYATNA_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్ : లక్నవరం తర్వాత సస్పెన్షన్ బ్రిడ్జి సిద్దిపేటలో ఏర్పాటు సిద్దిపేట పట్టణ ప్రజలకు పర్యాటకులకు అందుబాటులో వచ్చింది. ఇది సీఎం కేసీఆర్ కల సిద్దిపేట పట్టణంలో మంత్రుల పర్యటించారు. సిద్దిపేట కోమటి చెరువు పై నూతనంగా నిర్మించిన సస్పెన్షన్ బ్రీడ్జి ని ప్రారంభం చేసిన మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్... కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్ రఘోత్తంరెడ్డి పర్యాటక శాఖ అధికారులు కార్పొరేషన్ చైర్మన్ గారు పాల్గొన్నారు. బైట్01: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ........ కోమటి చెరువు అభివృద్ది సియం కేసీఆర్ కళ కోమటి చెరువు 1997 నుండి నేటి వరకు ఇంత అభివృద్ది జరిగింది.లక్నవరం తర్వాత సిద్దిపేటలో ఇంత పెద్ద సస్పెన్షన్ బ్రీడ్జి ఏర్పాటు చేసుకున్నాము. తెలంగాణ కు గొప్ప పండగ బతకమ్మ పండగ మహిళలు చెరువుల వద్దకు వస్తారు.చెరువును సుందరంగా తీర్చి దిద్దాము.ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణ ను నాటి పాలకులు పట్టించుకోలేదు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి లో దూసుకుపోతుంది.ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి మిగిలిన ఆహారాన్ని పాత బస్టాండ్ వద్ద పెట్టిన ప్రిజ్ లో పెట్టండి.అన్నదానం కంటే మించిన గొప్ప దానం లేదు రైతు బజార్ వద్దఉన్న మానవత్వంపు గది లో మీకు పనికి రాని బట్టలు వెయ్యండి.సహాయం చేయాలనుకునే వారు ఎవరైనా సహాయం చేయచ్చు కోమటి చెరువు సిద్దిపేట ప్రజల ఆస్థి ,అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి. బైట్:02: టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...... చరిత్ర సృష్టించిన గడ్డ సిద్దిపేట గడ్డ కేసీఆర్, హరీష్ రావు పుట్టిన గడ్డ సిద్దిపేట కేసీఆర్ మన రాష్ట్రంలో పుట్టకపోతే ఇవ్వాలా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలాఉండేదో ఇక్కడ ఇచ్చిన స్పూర్తితో తాగునీరు రాష్ట్రం మొత్తం కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది.70 ఏండ్ల 7 ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తే కేసీఆర్ అయిదు ఆరు ఏండ్లలో 1000 పాఠశాలలు ఏర్పాటు చేశారు.తెలంగాణ రాకుంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు ఉమ్మడి రాష్ట్రంలో అడుగు అడుగుణ అడ్డంకులు ఉండేవి కన్నీళ్లు వచ్చేవి.తెలంగాణ ఉద్యమం చావువరకు పోయి తెలంగాణ రాష్టాన్ని కేసీఆర్ తెచ్చిండు.దేశంలో తెలంగాణ అభివృద్ది లో మొదటి స్ధానంలో ఉంటుంది.మంత్రులుగా రోజుకు 500,600 కిలోమీటర్లు తిరిగి అభివృద్ది లో కేసీఆర్ బాటలో నాడుస్తాము.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పేర్లు మార్చుకుంటూ అధికారంలోకి రావాలని చూస్తున్నారు.ఎన్నో పోరాటాల వలన తెలంగాణ వచ్చింది.సిద్దిపేట ప్రజలకు ఏది కావాలన్నా మీ ముందుకు తెచ్చే నాయకుడు ఉన్నాడు.సియం కేసీఆర్ కన్ను ఎప్పుడైనా సిద్దిపేట ప్రజల పైన ఉంటుంది. ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ కు చిన్న మచ్చ లేకుండా పనిచేస్తాము. బైట్:01. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు 02. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Last Updated : Dec 2, 2019, 8:47 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.