సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ జలాశయ నిర్మాణంలో పనిచేసిన కూలీలను మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సన్మానించారు. తాజ్మహల్ ఒక అద్భుతమైన నిర్మాణమైనా.. దానిని కట్టిన కూలీలను ఎవరూ గుర్తించలేదని ఓ కవి అన్నారు.. కానీ ఈ జలాశయ నిర్మాణానికి పనిచేసిన ప్రతీ కూలీని మనం గౌరవించుకుందామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బిహార్, తదితర ప్రాంతాలను నుంచి వచ్చి జలాశయ నిర్మాణాన్ని సరైన సమయానికి పూర్తిచేసిన ప్రతి ఒక్క కూలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు