పదో తరగతి విద్యార్థులు ఎట్టిపరిస్థితిలో పత్తి ఏరేందుకు వెళ్లటానికి వీళ్లేదని మంత్రి హరీశ్రావు సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి హరీశ్రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 100 శాతం వచ్చేలా కృషి చేయాలని కస్తూర్బా గాంధీ విద్యాలయాల ప్రత్యేక అధికారిణి మనీలాకు ఆదేశించారు. కేజీబీవీల్లో పదో తరగతిలో కనీసం ఐదుగురికైనా 10కి పది రావాలని పిల్లలకు తెలిపారు. 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ.25 వేల ప్రోత్సాహక బహుమతి అందిస్తామని మంత్రి తెలిపారు. సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు తీసుకునే సమయంలో అవసరమైన అల్పాహారాన్ని అందించడానికి రూ. 36 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హరీశ్రావు తెలిపారు.
ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు