ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్... ప్రారంభించిన హరీశ్ రావు

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్‌ సహా ఐసీయూను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సర్కార్ దవాఖానాలో సిటీ స్కాన్ సౌకర్యం లేనందున ప్రజలకు ఉచితంగా సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. మరోవైపు డయాలసిస్‌ రోగుల కోసం మరో మూడు బెడ్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

author img

By

Published : Mar 21, 2021, 2:00 PM IST

minister harish rao starts city scan centre in siddipet government hospital
ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్... ప్రారంభించిన హరీశ్ రావు

సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. మళ్లీ కరోనా మహమ్మారి పెరుగుతుందని... ప్రజలు జాగ్రత్త పాటించాలని సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 2కోట్ల 15లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ సెంటర్​ను, 2 కోట్ల 40లక్షలతో ఐసీయూ సెంటర్​ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ లేనందున స్కానింగ్ కోసం వచ్చిన ప్రజలు హైదరాబాద్​కి వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని... వారికి ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రజలు సిటీ స్కాన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్... ప్రారంభించిన హరీశ్ రావు

ఇదీ చూడండి: ఒక్క ఫోన్‌ కాల్‌ నా జీవితాన్నే మార్చేసింది..!

సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. మళ్లీ కరోనా మహమ్మారి పెరుగుతుందని... ప్రజలు జాగ్రత్త పాటించాలని సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 2కోట్ల 15లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ సెంటర్​ను, 2 కోట్ల 40లక్షలతో ఐసీయూ సెంటర్​ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ లేనందున స్కానింగ్ కోసం వచ్చిన ప్రజలు హైదరాబాద్​కి వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని... వారికి ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రజలు సిటీ స్కాన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్... ప్రారంభించిన హరీశ్ రావు

ఇదీ చూడండి: ఒక్క ఫోన్‌ కాల్‌ నా జీవితాన్నే మార్చేసింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.