ETV Bharat / state

గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం: హరీశ్‌రావు

author img

By

Published : Sep 26, 2020, 5:59 PM IST

Updated : Sep 26, 2020, 7:29 PM IST

రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం నెలరోజుల్లో అమల్లోకి వస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. భూ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించి కొత్త పాసుపుస్తకాలు అందిస్తామని చెప్పారు. గ్రామాలను గుడిసెలు లేకుండా తీర్చిదిద్దుకుందామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటన సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

minister harish rao said Let's make village with huts
గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం: హరీశ్‌రావు

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా తెరాసలో చేరిన నాయకులకు పార్టీ కుండువా కప్పి మంత్రి ఆహ్వానించారు.

గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం: హరీశ్‌రావు

"రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా బియ్యం ఇచ్చాం. పింఛను, రైతు బంధు కూడా అందించాం. ప్రస్తుతం రైతులు సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఇళ్లను కూడా అందిస్తాం. ప్రతి గ్రామానికి వైకుంఠధామం, ట్రాక్టర్​, ట్రాలీ మంజూరు చేశాం. గ్రామాల్లో గుడిసెలు లేకుండా తీర్చిదిద్దుతాం.

కేంద్ర వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర వ్యవసాయబిల్లు రైతుల వ్యతిరేక బిల్లు అంటూ చాలా ఆందోళనలు చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఒక కేంద్రమంత్రి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం నెలరోజుల్లో అమల్లోకి వస్తుంది. భూ సమస్యలన్నీ పరిష్కరించి కొత్త పాసుపుస్తకాలు అందిస్తాం."

- రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

ఇదీ చూడండి: భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా తెరాసలో చేరిన నాయకులకు పార్టీ కుండువా కప్పి మంత్రి ఆహ్వానించారు.

గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం: హరీశ్‌రావు

"రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా బియ్యం ఇచ్చాం. పింఛను, రైతు బంధు కూడా అందించాం. ప్రస్తుతం రైతులు సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఇళ్లను కూడా అందిస్తాం. ప్రతి గ్రామానికి వైకుంఠధామం, ట్రాక్టర్​, ట్రాలీ మంజూరు చేశాం. గ్రామాల్లో గుడిసెలు లేకుండా తీర్చిదిద్దుతాం.

కేంద్ర వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర వ్యవసాయబిల్లు రైతుల వ్యతిరేక బిల్లు అంటూ చాలా ఆందోళనలు చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఒక కేంద్రమంత్రి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం నెలరోజుల్లో అమల్లోకి వస్తుంది. భూ సమస్యలన్నీ పరిష్కరించి కొత్త పాసుపుస్తకాలు అందిస్తాం."

- రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

ఇదీ చూడండి: భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ

Last Updated : Sep 26, 2020, 7:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.