ETV Bharat / state

'ముస్లింల అభ్యున్నతికి అహర్నిషలు పాటుపడుతోన్న రాష్ట్రం తెలంగాణ..'

author img

By

Published : Apr 24, 2022, 9:26 PM IST

సిద్దిపేటలోని మదీనా ఫంక్షన్​హాల్​లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ విందులో మంత్రి హరీశ్​రావు హాజరయ్యారు. విందులో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్​తో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

minister Harish rao participated in iftar party in siddipet
minister Harish rao participated in iftar party in siddipet

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలోని మదీనా ఫంక్షన్​హాల్​లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్​తో కలిసి మంత్రి హాజరయ్యారు. విందులో పాల్గొన్న మంత్రి సహపంక్తి భోజనాలు చేశారు.

రాష్ట్రంలోని ముస్లింలను సీఎం కేసీఆర్ గౌరవంగా నిలబెట్టారని మంత్రి తెలిపారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. అందరి సహకారంతో సిద్దిపేటను ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. పట్టణంలో ముస్లిం మైనారిటీలకు 500 డబుల్ బెడ్​ రూం ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలో ఖబరాస్తాన్ ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.15 లక్షల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.

"సిద్దిపేటను అల్లా దయవల్ల సీఎం కేసీఆర్ సహకారంతో ఇప్పటికే చాలా అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధిలో సిద్దిపేటను వేలెత్తి చూపించేవారే లేరు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసుకుందాం. ముస్లిం అమ్మాయిలకు షాదీ ముబారక్ పేరిట ఆర్థిక సాయం చేస్తూ.. సీఎం కేసీఆర్​ అండగా ఉంటున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. విద్య కోసం పెద్దపీట వేసిన ప్రభుత్వం.. మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేసి ముస్లిం సోదరుల చదువుకు భరోసా అందిస్తున్నాం. మైనారిటీ పాఠశాలలు ఏర్పాటు చేసి.. ముస్లింల అభ్యున్నతి కోసం పాటు పడటంలో తెలంగాణ ఓ మోడల్​గా నిలిచిందని ఇటీవలే ఓ నివేదిక కూడా తెలిపింది." - హరీష్ రావు, మంత్రి

ఇవీ చూడండి:

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి హరీశ్​రావు తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలోని మదీనా ఫంక్షన్​హాల్​లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్​తో కలిసి మంత్రి హాజరయ్యారు. విందులో పాల్గొన్న మంత్రి సహపంక్తి భోజనాలు చేశారు.

రాష్ట్రంలోని ముస్లింలను సీఎం కేసీఆర్ గౌరవంగా నిలబెట్టారని మంత్రి తెలిపారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. అందరి సహకారంతో సిద్దిపేటను ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. పట్టణంలో ముస్లిం మైనారిటీలకు 500 డబుల్ బెడ్​ రూం ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టణంలో ఖబరాస్తాన్ ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.15 లక్షల నిధులు మంజూరు చేశామని వెల్లడించారు.

"సిద్దిపేటను అల్లా దయవల్ల సీఎం కేసీఆర్ సహకారంతో ఇప్పటికే చాలా అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధిలో సిద్దిపేటను వేలెత్తి చూపించేవారే లేరు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసుకుందాం. ముస్లిం అమ్మాయిలకు షాదీ ముబారక్ పేరిట ఆర్థిక సాయం చేస్తూ.. సీఎం కేసీఆర్​ అండగా ఉంటున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. విద్య కోసం పెద్దపీట వేసిన ప్రభుత్వం.. మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేసి ముస్లిం సోదరుల చదువుకు భరోసా అందిస్తున్నాం. మైనారిటీ పాఠశాలలు ఏర్పాటు చేసి.. ముస్లింల అభ్యున్నతి కోసం పాటు పడటంలో తెలంగాణ ఓ మోడల్​గా నిలిచిందని ఇటీవలే ఓ నివేదిక కూడా తెలిపింది." - హరీష్ రావు, మంత్రి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.