ETV Bharat / state

అప్పుడు ఇల్లు కడితే అప్పుల పాలే..: మంత్రి హరీశ్

author img

By

Published : Dec 21, 2020, 5:47 PM IST

సిద్దిపేట ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో రెండు పడక గదుల ఇళ్లను మంత్రి హరీశ్​ రావు ప్రారంభించారు. గూడులేని నిరుపేదలందరికీ ఇళ్లు ఇవ్వడమే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమన్నారు. త్వరలో అర్హులందరికీ ఇళ్లు అందించనున్నట్టు తెలిపారు.

అప్పుడు ఇల్లు కడితే అప్పుల పాలే..: హరీశ్
అప్పుడు ఇల్లు కడితే అప్పుల పాలే..: హరీశ్

పేదలు గౌరవంగా బతికేందుకే... ముఖ్యమంత్రి కేసీఆర్​ రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని ఆర్థికమంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలోని లింగారెడ్డిపల్లిలో... 25 డబుల్​ ఇళ్లు ప్రారంభించారు. ఆలస్యమైనా ఇళ్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అర్హులందరికీ త్వరలోనే మరిన్ని ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, తెదేపా హయాంలో ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.40 వేలు మాత్రమే ఇచ్చేవారు... అవి బేస్​మెంట్​కు కూడా సరిపోయేవి కావని హరీశ్ ఎద్దేవా చేశారు. అప్పుడు ఇల్లు కడితే అప్పులు పాలయ్యేవారన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం ఎవరికైనా లంచం ఇచ్చినా, తీసుకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఎల్లమ్మ గుడి నుంచి చిన్న కోడూరు వరకు పోర్ లైన్ రోడ్డు, రామంచ వరకు బ్లటర్​లైట్స్, యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. రంగనాయక సాగర్ ఉన్నంత వరకు ఇక్కడి రైతుల పేరు ఉంటుందని, రంగనాయక సాగర్ అద్భుత పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: యాసంగిపై మంత్రి సమీక్ష.. సాగుపై సుధీర్ఘ చర్చ

పేదలు గౌరవంగా బతికేందుకే... ముఖ్యమంత్రి కేసీఆర్​ రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని ఆర్థికమంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలోని లింగారెడ్డిపల్లిలో... 25 డబుల్​ ఇళ్లు ప్రారంభించారు. ఆలస్యమైనా ఇళ్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అర్హులందరికీ త్వరలోనే మరిన్ని ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, తెదేపా హయాంలో ఇళ్ల నిర్మాణానికి కేవలం రూ.40 వేలు మాత్రమే ఇచ్చేవారు... అవి బేస్​మెంట్​కు కూడా సరిపోయేవి కావని హరీశ్ ఎద్దేవా చేశారు. అప్పుడు ఇల్లు కడితే అప్పులు పాలయ్యేవారన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం ఎవరికైనా లంచం ఇచ్చినా, తీసుకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఎల్లమ్మ గుడి నుంచి చిన్న కోడూరు వరకు పోర్ లైన్ రోడ్డు, రామంచ వరకు బ్లటర్​లైట్స్, యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. రంగనాయక సాగర్ ఉన్నంత వరకు ఇక్కడి రైతుల పేరు ఉంటుందని, రంగనాయక సాగర్ అద్భుత పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: యాసంగిపై మంత్రి సమీక్ష.. సాగుపై సుధీర్ఘ చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.