ETV Bharat / state

వర్గల్​ సరస్వతి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం

author img

By

Published : Dec 13, 2020, 12:21 PM IST

సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం కార్తీక దీపోత్సవం సందర్భంగా దీప కాంతులతో మెరిసిపోయింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయ నిర్వాహకులు దేవాలయ ప్రాంగణంలో శనివారం రాత్రి ఏర్పాటుచేసిన కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది.

వర్గల్​ సరస్వతి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం
వర్గల్​ సరస్వతి క్షేత్రంలో కార్తీక దీపోత్సవం

సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఆలయ వ్యవస్థాపకుడు రాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి పర్యవేక్షణలో కార్తీక దీపోత్సవాన్ని భక్తిభావంతో నిర్వహించారు.

భారీ సంఖ్యలో హాజరైన మహిళలు దీపాలను వెలిగించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతి వెలిగించి దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీపోత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రోజా శర్మతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఆలయ వ్యవస్థాపకుడు రాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి పర్యవేక్షణలో కార్తీక దీపోత్సవాన్ని భక్తిభావంతో నిర్వహించారు.

భారీ సంఖ్యలో హాజరైన మహిళలు దీపాలను వెలిగించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య జ్యోతి వెలిగించి దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీపోత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రోజా శర్మతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: భద్రాద్రి రాముడి సేవలో మంత్రి నిరంజన్ రెడ్డి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.