ETV Bharat / state

మేకల కాపరి కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే

కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ కుటుంబాన్ని పెద్దమనసుతో ఆదుకున్నాడు హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్. ఆస్పత్రి బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న పేద కుటుంబానికి రూ.లక్ష సాయం అందించి ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన మేకల కాపరి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు.

author img

By

Published : Dec 24, 2020, 12:40 PM IST

husnabad MLA satish kumar  supported  for the medical bill for poor family in siddipeta dist
మేకల కాపరి కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే

కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ కుటుంబాన్ని పెద్దమనసుతో ఆదుకున్నాడు హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్. ఆస్పత్రి బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న పేద కుటుంబానికి రూ.లక్ష సాయం అందించి ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన మేకల కాపరి వెంకటేశ్​(32)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చేర్పించగా నరాలకు సంబంధించిన జీబీఎస్​ వ్యాధి సోకిందన్నారు. ఒక్కో ఇంజక్షన్​కు రూ.16 వేలతో నాలుగు రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

అతని పరిస్థితి విషమించడంతో ఒమేగా ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల చికిత్సకు రూ.1,57,000 బిల్లు వచ్చింది. అంత డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి బిల్లు కడితేనే డిశ్చార్జ్​ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది. వారి వద్ద కేవలం రూ.40 వేలే ఉండగా వారి గ్రామ సర్పంచ్​ గాజుల రమేశ్​ చొరవతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.లక్ష నగదును కుటుంబసభ్యులకు అందించారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయిన బైరి వెంకటేశ్​ ఇంటికి వెళ్లి కో ఆప్షన్​ సభ్యుడు మాధవరెడ్డి, మాజీ మార్కెట్​ కమిటీ డైరెక్టర్​ గాజుల మల్లయ్య, సర్పంచ్, వార్డు సభ్యులు పరామర్శించారు. ఆర్థికసాయం అందించిన ఎమ్మెల్యేకు వారి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చూడండి: బాతిక్‌ బ్రహ్మ బాలయ్య కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ కుటుంబాన్ని పెద్దమనసుతో ఆదుకున్నాడు హుస్నాబాద్​ ఎమ్మెల్యే సతీశ్​కుమార్. ఆస్పత్రి బిల్లు చెల్లించలేని స్థితిలో ఉన్న పేద కుటుంబానికి రూ.లక్ష సాయం అందించి ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన మేకల కాపరి వెంకటేశ్​(32)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చేర్పించగా నరాలకు సంబంధించిన జీబీఎస్​ వ్యాధి సోకిందన్నారు. ఒక్కో ఇంజక్షన్​కు రూ.16 వేలతో నాలుగు రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

అతని పరిస్థితి విషమించడంతో ఒమేగా ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల చికిత్సకు రూ.1,57,000 బిల్లు వచ్చింది. అంత డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి బిల్లు కడితేనే డిశ్చార్జ్​ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పింది. వారి వద్ద కేవలం రూ.40 వేలే ఉండగా వారి గ్రామ సర్పంచ్​ గాజుల రమేశ్​ చొరవతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.లక్ష నగదును కుటుంబసభ్యులకు అందించారు. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్​ అయిన బైరి వెంకటేశ్​ ఇంటికి వెళ్లి కో ఆప్షన్​ సభ్యుడు మాధవరెడ్డి, మాజీ మార్కెట్​ కమిటీ డైరెక్టర్​ గాజుల మల్లయ్య, సర్పంచ్, వార్డు సభ్యులు పరామర్శించారు. ఆర్థికసాయం అందించిన ఎమ్మెల్యేకు వారి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చూడండి: బాతిక్‌ బ్రహ్మ బాలయ్య కన్నుమూత.. కేసీఆర్ సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.