సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సిద్దిపేట-హనుమకొండ రహదారిపై ప్రమాదం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణరావుపేటకు చెందిన అఖిల్... సిద్దిపేటకు వెళ్తున్నాడు. అతివేగంగా వెళ్లిన అఖిల్... జేసీబీ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అఖిల్ తీవ్రంగా గాయపడ్డాడు.
క్షతగాత్రుడిని వెంటనే సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఇవీ చూడండి: భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య