ETV Bharat / state

సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు - సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు

సిద్దిపేటలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రంథాలయ భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.

సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు
author img

By

Published : Nov 14, 2019, 9:12 PM IST

సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పర్యటించారు. జిల్లా గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుస్తకం ఓ మంచి స్నేహితుడని అన్నారు. పురాతనమైన ఈ గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు. 2 కోట్లతో నిర్మిస్తున్న నూతన భవనాన్ని... వచ్చే మార్చి నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని 7 మండలాల్లోనూ గ్రంథాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు.

సిద్దిపేట నూతన గ్రంథాలయ భవనంలో మహిళలకు, పురుషులకు, విద్యార్థులకు వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పుస్తకాల కొనుగోలుకు 40 లక్షలు మంజూరు అయినట్లు చెప్పారు. నేటి యువత సెల్​ఫోన్​ మోజులో పడి పుస్తకాలని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ వేలేటి రోజాశర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ లక్కిరెడ్డి ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు.

సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు

ఇవీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు పర్యటించారు. జిల్లా గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పుస్తకం ఓ మంచి స్నేహితుడని అన్నారు. పురాతనమైన ఈ గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు. 2 కోట్లతో నిర్మిస్తున్న నూతన భవనాన్ని... వచ్చే మార్చి నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని 7 మండలాల్లోనూ గ్రంథాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు.

సిద్దిపేట నూతన గ్రంథాలయ భవనంలో మహిళలకు, పురుషులకు, విద్యార్థులకు వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పుస్తకాల కొనుగోలుకు 40 లక్షలు మంజూరు అయినట్లు చెప్పారు. నేటి యువత సెల్​ఫోన్​ మోజులో పడి పుస్తకాలని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ వేలేటి రోజాశర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ లక్కిరెడ్డి ప్రభాకర్​రెడ్డి పాల్గొన్నారు.

సెల్​ఫోన్​ బానిసలై... పుస్తకాన్ని మరిచిపోతున్నారు: హరీశ్​రావు

ఇవీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

రిపోర్టర్ : పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_72_14_HARISH_SCRIPT_TS0058 సెంటర్:సిద్దిపేట జిల్లా:సిద్ధిపేట యాంకర్: సిద్ధిపేట జిల్లాలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పర్యటించారు.. సిద్ధిపేట జిల్లా గ్రంధాలయం లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంత్రి హరీష్ రావు జడ్పీ చైర్మన్ వేలేటి రొజాశర్మ.. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లు హాజరు అయ్యారు ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్ధిపేట గ్రంధాలయానికి గొప్ప చరిత్ర ఉంది.. ఈ గ్రంధాలయం ద్వారా ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఎదిగారు.. ఈ గ్రంధాలయం పురాతనమైనదని అన్నారు.. నూతన గ్రంధాలయం నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు కేటాయించి నిర్మిస్తున్నామని, వచ్చే మార్చ్ నెలలో నూతన గ్రంధాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలకు,పురుషులకు,విద్యార్థులకు వేరువేరుగా విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు పుస్తకం మంచి నేస్తం..నేటితరం సెల్ ఫోన్ మోజులో పడి పుస్తక పఠనం మరిచిపోతున్నామని సెల్ ఫోన్ లకు బానిసలై పుస్తకాలను మరిచి పోతున్నామని అన్నారు జిల్లాలో 7 మండలాల్లో నూతన గ్రంధాలయాలను నిర్మిస్తామని,పుస్తకాల కొనుగోలుకు జిల్లాకు 40 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని ఆడబ్బుతో అందరికీ ఉపయోగపడే విధంగా గ్రంధాలయాలకు పుస్తకాలు కొనుగోలు చేస్తామని తెలిపారు. బైట్ : హరీష్ రావు ( మంత్రి )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.